Pahalgam Terror Attack : జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు

టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్‌‌‌‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.

New Update
Massive protests in Jammu and Kashmir

Massive protests in Jammu and Kashmir

Pahalgam Terror Attack : టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్‌‌‌‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు పెద్ద సంఖ్యలో రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. టెర్రరిజాన్ని సహించం.. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు. కాశ్మీరుల  రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. స్వచ్చంధంగా దుకాణాలు మూసేసి.. నిరసనల్లో పాల్గొంటున్నారు. ఐక్యతా నినాదాలతో భారత సైన్యానికి మద్దతు ఇస్తున్నారు.హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘నేను భారతీయుడినే’ అంటూ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. భారత సైన్యానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించాయి. ప్రజలు నిరసనల్లో పాల్గోనాలంటూ మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా పిలుపునిస్తున్నారు. మార్కెట్లు అన్ని మూసేయాలని కోరారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెల్పడంతో.. 35 ఏళ్ల కాలంలో లోయలో బంద్ పాటించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

మానవత్వంపై జరిగిన దాడి

ఇక ఉగ్రమూకల కాల్పుల్లో పర్యాటకులకు గుర్రపు స్వారీలు అందించే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ప్రాణాలు వదిలాడు. ఉగ్రవాదుల చేతుల్లోంచి తుపాకీలు లాక్కునే ప్రయత్నం చేసి పలువురి ప్రాణాలు కాపాడాడు. చివరికి ముష్కరుల తూటాలకు సయ్యద్ బలైపోయాడు. ఇక జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న పర్యాటకులకు 15 రోజులు ఉచితంగా బస ఏర్పాటు చేస్తామని హోటళ్ల యజమాని ఆసిఫ్ బుర్జా తెలిపారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని.. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించాడు. సిగ్గుతో మా తలలు వేలాడుతున్నాయని ఆసిఫ్ బుర్జా పేర్కొన్నారు. టూరిస్టులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే భారత సైన్యానికి అండగా ఉంటామని ప్రకటించారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

ట్రెండింగ్ లో పహల్గామ్‌‌‌‌ అటాక్‌‌‌‌ హ్యాష్‌‌‌‌ట్యాగ్‌

వెకేషన్‌‌‌‌కు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చేసిన తప్పేంటి.. ఇప్పుడు వాళ్ల కుటుంబాల పరిస్థితేంటి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు తామంతా ఆర్మీతో కలిసి పోరాడుతామంటూ నినదించారు. దాడి ఘటనను ఖండిస్తూ ఢిల్లీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలంటూ తమ చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ర్యాలీ తీశారు. కాగా, పహల్గామ్‌‌‌‌ దాడిపై కోట్లాదిమంది ప్రజలు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పహల్గామ్‌‌‌‌ అటాక్‌‌‌‌ హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌ ట్రెండింగ్​గా మారింది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

మరోసారి దాడులకు అవకాశం : నిఘావర్గాలు

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన పహల్గామ్‌లోని బైసరన్ ప్రాంతంలో విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం అధికారికంగా ప్రటించింది. ఈ దాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు, జమ్మూకాశ్మీర్‌‌లో దాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. శ్రీనగర్, ఉధంపూర్ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నక్కిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.  

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 

Advertisment
Advertisment
తాజా కథనాలు