/rtv/media/media_files/2025/04/18/mNxhdjQ9cmRH75Dt8Wl1.jpg)
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ ఖగర్ పేరుతో నక్సల్స్ను సాయుధ బలగాలు ఏరిపారేస్తున్నాయి. గతకొన్ని నెలలుగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఏప్రిల్ 7న కూడా 26 మంది నక్సలైట్లు సరెండరైన విషయం తెలిసిందే. తాజాగా సుక్మా జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు శుక్రవారం భద్రతా దళాల ముందు లొంగిపోయారు. జన జీవన స్రవంతిలో కలిసిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. 22 మంది మావోయిస్టుల్లో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50వేల సాయం అందించినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారి వివరాలు పోలీసులు తీసుకున్నారు.
Also read: Lady Don: హాట్ టాపిక్గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
#WATCH | 22 Naxals, including nine women naxals, have surrendered in Chhattisgarh's Sukma.
— ANI (@ANI) April 18, 2025
DIG (CRPF) Anand Singh Rajpurohit says, "22 Naxalites, including nine women naxals, have surrendered today - two of the naxals carry an award of Rs 8 lakhs on their head, two others carry… pic.twitter.com/5EYeJxfI81
2026 మార్చి 31లోపు మావోయిస్టులు అంతం
ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. 2024లో సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు సరెండర్ అయినట్టు పోలీసులు తెలిపారు. అంతకు కొన్ని రోజుల ముందు 70 మంది మావోలు మూకుమ్మడిగా లొంగిపోయారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో గురువారం జరిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్కు చెందిన 86వ రైజింగ్ డే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31లోపు మావోయిస్టులు అంతమవుతారని అన్నారు. నక్సల్స్ను రూపుమాపడంలో సీఆర్పీఎఫ్ బలగాలు కీలకం పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు.
Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!