/rtv/media/media_files/2025/06/29/madhya-pradesh-govt-takes-action-against-8-engineers-over-bridge-with-90-degree-turn-2025-06-29-18-15-57.jpg)
Madhya pradesh govt takes action against 8 engineers over bridge with 90-degree turn
మధ్యప్రదేశ్లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ డిజైన్పై తీవ్రంగా విమర్శలొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్పై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
MP Govt Takes Action Over Railway Bridge
भोपाल में 90 डिग्री मोड़ वाले ब्रिज को लेकर एक्शन: सीएम ने 8 अफसरों को किया सस्पेंड, डिजाइन और निर्माण एजेंसी भी ब्लैकलिस्ट#Bhopal #90DegreeBridge #MohanYadavhttps://t.co/oOS7Ci2EJm pic.twitter.com/jnEYhANXp5
— Dainik Bhaskar (@DainikBhaskar) June 29, 2025
Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్లో దారుణ హత్య!
దీనిపై సీఎం మోహన్ యాదవ్ కూడా స్పందించారు. '' ఐష్బాగ్లో ROB నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించాం. రిపోర్టు ఆధారంగా 8 మంది PWD ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నాం. ఇందులో ఏడుగురు ఇంజినీర్లను వెంటనే సస్పెండ్ చేశాం. నిర్మాణ ఏజెన్సీ, డిజైన్ను రూపొందించిన కన్సల్టెంట్ను బ్లాక్లిస్ట్లో కూడా చేర్చాం. ROB పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని'' మోహన్ యాదవ్ అన్నారు.
🚨: MP Government has Suspended 7 PWD Engineers Over the Infamous ‘90 Degree Bridge’. pic.twitter.com/1aHPGzUzM3
— The Frustrated Indian (@FrustIndian) June 29, 2025
Also Read: ఉక్రెయిన్పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...
ఇదిలాఉండగా.. భోపాల్లోని ఐష్బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. కానీ ఇది 90 డిగ్రీల మలుపు తిరిగి ఉంది. దీంతో ఈ నిర్మాణంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. నిర్మాణ సంస్థ మాత్రం ఆ రైల్వే బ్రిడ్జి డిజైన్ను సమర్థించుకుంది. దగ్గర్లో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత ఉందని.. ఇలా నిర్మించడం తప్ప మరో మార్గం లేదని చెప్పింది. కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉండి ఉంటే ఆ రూట్ సవ్యంగా ఉండేదని పేర్కొంది. కానీ దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది.
Also Read: బెంగళూరులో దారుణం...కుక్క రక్తంతో క్షుద్రపూజల కలకలం
Also Read: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్
madya pradesh | rtv-news | telugu-news