Kolkata law student: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్‌కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్

కోల్‌కతాలోని లా విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధిత యువతి మెడ, రొమ్ములపై పదునైన పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

New Update
Kolkata law student Gang Rape medical report

Kolkata law student Gang Rape medical report

కోల్‌కతాలోని లా కాలేజ్‌లో ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్ ఇన్సిడెంట్ యావత్ దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆ బాధిత యువతి మెడికల్ రిపోర్టు బయటకు వచ్చింది. 

Kolkata law student

శుక్రవారం ఆ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఆ మెడికల్ రిపోర్టు వెల్లడైంది. ఈ రిపోర్టులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ బాధిత యువతి శరీరంపై గాయాలు, బలవంతంగా లైంగిక సంబంధం ఉన్నట్లు తెలిపారు.

నిందితులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని రిపోర్టులో వెల్లడైంది. బాధిత యువతి మెడ చుట్టూ గాట్లు, రొమ్ములపై పదునైన పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా అత్యంత తీవ్రంగా గాయపరిచారని రిపోర్టులో తెలిపారు.  

5 రోజుల పాటు పోలీస్ కస్టడీ

ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టులో హజరుపర్చారు. దీంతో న్యాయస్థానం నిందుతులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

కాలేజీ యూనియన్ రూమ్‌లో ఉండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా మనోజిత్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. దీనికి యువతి ఒప్పకుకోపోవడంతోనే మనోజిత్‌ స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డాడు. లా సెక్యూరిటీ రూం బంధించి రాత్రి వరకు అత్యాచారం చేశారు. పారిపోయేందుకు యత్నించిన బాధితురాలిపై హాకీ స్టిక్‌తో దాడి చేశారు. అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోను కూడా నిందితులు తీశారు.

Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఆమె తనను ఆస్పత్రికి తీసుకెళ్లండి ప్లీజ్ అని వేడుకున్నా కూడా ఆ దుర్మార్గులు కనికరించలేదు. ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. మరోవైపు ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ కూడా సుమోటాగా స్వీకరించింది. ఈ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమీద్‌ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు