Bengaluru: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!

బెంగళూరులో చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. మహిళ చేతులు, మెడను తాళ్లతో కట్టేసి, గోనె సంచిలో వేసి చెత్త లారీలో కొందరు దుండగులు పడేశారు. లోదుస్తులు లేకుండా మహిళ మృతదేహాన్ని చెత్తలో వేశారు.

New Update
Crime

Crime

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెత్త లారీలో మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ చేతులు, మెడను తాళ్లతో కట్టేసి, గోనె సంచిలో వేసి చెత్త లారీలో కొందరు దుండగులు పడేశారు. లోదుస్తులు లేకుండా మహిళ మృతదేహాన్ని చెత్తలో వేశారు. ఆమెను అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు అనిమానిస్తున్నారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లినట్లు కూడా సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

ఓ బాలికపై యువకుడు..

ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అరెస్టు చేసి కరెక్షనల్ హోమ్‌కు పంపించారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

ఏడేళ్ల బాలిక తన ఇంటి సమీపం నుంచి నీరు తీసుకురావడానికి వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడంతో అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తండ్రితో చెప్పింది. దీంతో అతడు నిందితుడి తండ్రికి ఫోన్ చేశాడు. ఆ సమయంలో నిందితుడు తండ్రి.. బాధిత బాలికను చంపేస్తానని బెదిరించాడు. 

ఇది కూడా చూడండి: Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!

దీంతో బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు, అతడి తండ్రిపై కేసు నమోదు చేశారు. అనంతరం బాల నేరస్థుడ్ని కరెక్షనల్ హౌమ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడి తండ్రి కోసం గాలిస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ (ఖుర్జా) పూర్ణిమ సింగ్ తెలిపారు. త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు