/rtv/media/media_files/2025/04/25/JSvIoTEnDmmShAYi2JXZ.jpg)
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన కుట్రదారులు ఎవరనేదానిపై ఇండియన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేస్తోంది. పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఏప్రిల్ 22న జరిగిన దాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: Army Encounter: ఆర్మీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
(lashkar-e-taiba | Jammu and Kashmir | indiavspakistan | pakistan | latest-telugu-news | pahalgam terror attack | Lashkar Chief Hafiz Saeed)