Kolkata Crime: ముంబై ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు!

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Kolkata Airport indigo flight bomb

Kolkata Airport indigo flight bomb

Kolkata Airport: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్పటికే విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా ఈ సమాచారం రావడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని ఐసోలేషన్‌ బేకి తరలించి ప్రయాణికులను దింపి లగేజీతోసహా సమగ్రంగా తనిఖీలు చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు, ఇతర భద్రతా సిబ్బంది సమగ్ర తనిఖీలు నిర్వహించగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అనంతరం ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read :  అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్

భద్రత మరింత కట్టుదిట్టం:

ఈ ఘటన కొద్ది నిమిషాల్లోనే కోల్‌కతా ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 195 మంది ప్రయాణికులు చెక్‌ఇన్‌ చేసిన ఈ విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయల్దేరి సాయంత్రం 4:20 గంటలకు ముంబైకి చేరుకోవాల్సి ఉండగా.. బెదిరింపు కాల్‌ రావడంతో అధికార యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేసి విమానాశ్రయం మొత్తాన్ని తనిఖీ చేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి కదలికను గమనించారు. ఈ కాల్‌ వలన ప్రయాణికుల మధ్య ఆందోళన చెందకుండా అధికారులు వేగవంతమైన చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఇది కూడా చదవండి:  పాలన్నం తింటే ఆరోగ్యానికి తక్షణ శక్తి.. ఇలా ట్రై చేయండి

ఇటీవలి కాలంలో ఇది రెండవ బాంబు బెదిరింపు ఘటన కావడం గమనార్హం. మే 6న ఛండీగఢ్ నుంచి ముంబై వెళ్తున్న మరో ఇండిగో విమానం కూడా ఇలాంటి బెదిరింపు కాల్‌కు గురైంది. ఆ కాల్ అనంతరం జరిపిన తనిఖీల్లో ఏవీ దొరకకపోవడంతో అది బూటకమని తేలింది. తాజాగా వచ్చిన కోల్‌కతా ఘటనలోనూ అలాగే ఎలాంటి బాంబు లభించకపోయినా దేశంలో కొనసాగుతున్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు అధికారుల కసరత్తును పెంచుతున్నాయి. దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రత మరింత కఠినంగా అమలవుతున్న ఈ తరుణంలో.. నిర్ధిష్ట ఆధారాల్లేని బాంబు బెదిరింపులు పౌరుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల యుద్ధ ప్రాతిపదికన స్పందన వలన ప్రాణాపాయం తప్పిటంతో అందరూ సంతోషంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి

Also Read :  ఊరమాస్.. శాంసంగ్ నుంచి 200MP కెమెరా ఫోన్ - ఫీచర్లు పిచ్చ క్లాస్!


(crime news | latest-news | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు