Pahalgam Attack: ఉగ్రదాడి.. అమిత్ షా కు ఫోన్‌ చేసిన రాహుల్, ఖర్గే

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరారు.

New Update
Kharge, Rahul Gandhi speak to Amit Shah, demand justice for victims' families

Kharge, Rahul Gandhi speak to Amit Shah, demand justice for victims' families

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్‌ సహా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. సోమవారం ఉదయం దీనిపై పోస్ట్ చేశారు. 

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

కేంద్రమంత్రి అమిత్‌ షా, జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లాతో తాను మాట్లాడినట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చర్చించినట్లు చెప్పారు. అలాగే బాధితులకు తాము అండగా ఉంటామని.. వాళ్లకి న్యాయం జరగాలని కోరారు. ఖర్గే కూడా మంగళవారం రాత్రి ఒమర్ అబ్దుల్లా, అమిత్ షాతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాల్సిందేనన్నారు. అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.  

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఇదిలాఉండగా.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బుధవారం పహల్గాం నుంచి శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. అక్కడ అధికారులకు వీళ్లకి నివాళులు అర్పించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా మృతదేహాలకు అంజలి ఘటించనున్నారు. ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు .  

Also Read: పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..

 Pahalgam attack | telugu-news | national-news | jammu-kashmir 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు