Pahalgam Attack: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

జమ్మూలోని పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా అక్కడే ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇందులో నలుగురిని గుర్తుపట్టినట్టు చెబుతున్నారు. టెర్రరిస్టుల్లో ఒకరి ఫోటో కూడా బయటకు వచ్చింది. 

New Update
jammu

Terrorist

కాశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురు టెర్రరిస్టులను జమ్మూ-కాశ్మీర్ పోలీసులు గుర్తుపట్టారు. వీరిలో ఒకరు ఆదిల్ గురి అనీ...ఇతను 2018లో పాకిస్తాన్ ను వదిలిపెట్టి వచ్చేశాడని చెబుతున్నారు. మరొక ఉగ్రవాది పేరు ఆసిఫ్ షేక్ అని తెలిపారు. మరో ఇద్దరు పాకిస్తాన్ దేశస్థులని...వారు ఆసిఫ్, ఆదిల్ తో కలిసి వచ్చారని పోలీసులు గుర్తించారు. మిగతావారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న ఒక బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడే..

మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తుతం శ్రీనగర్ లోనే ఉన్నారు. అక్కడ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. మరి కాసేపట్లో పహల్గామ్ లో దాడి జరిగిన చోటికి అమిత్ షా వెళ్ళనున్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్ పోర్ట్ లోనే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీతో భేటీ అయ్యారు. మొత్తం ఘటన గురించి తెలుసుకున్నారు. ఇదే కాకుండా మరికొద్ది సేపటిలో ప్రధాని మోదీ అత్యవసర కేబినెట్ భేటీలో కూడా పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు మోదీ అధ్యక్షత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ  అత్యవసరంగా సమావేశం కానుంది. 

today-latest-news-in-telugu | police

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు