Pahalgam Attack: పాక్‌పై దాడిచేస్తే బతకరు.. మోదీకి వార్నింగ్ ఇస్తూ ఖలిస్తానీ నేత బలుపు మాటలు!

పహాల్గాం అటాక్ నేపథ్యంలో ఖలిస్తానీ నేత పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌పై దాడిని సిక్కులు అనుమతించరన్నాడు. 20 మిలియన్ల మంది పాకిస్తాన్‌కు ఇటుక గోడలా రక్షణ కల్పిస్తారన్నాడు. పాక్‌పై అటాక్ చేస్తే మోదీ, షా ఎవరు బతకరంటూ హెచ్చరించాడు.

New Update
pannu khalistan

Khalistani leader Pannu sensational comments on Pahalgam attack

Pahalgam Attack: పహల్గాం అటాక్ నేపథ్యంలో పాక్ ఉగ్రవాడులపై దాడికి భారత్ సిద్ధమైంది. అయితే ఇండియన్ ఆర్మీని పాక్‌పై అటాక్ చేయనివ్వమంటూ ఖలీస్తానీ నేత పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 20 లక్షల మంది సిక్కులు పాక్‌కు దన్నుగా ఉన్నామని, పంజాబ్ మీదుగా ఆర్మీని వెళ్ళ నివ్వమన్నాడు. సిక్కులకు పాకిస్తాన్‌కు మంచి సంబంధాలున్నాయని, పాకిస్తాన్ మీద దాడి చేసే వారెవరు బతకరంటూ ప్రధానీ, మోదీకి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

ఇటుక గోడలా రక్షణ..

ఈ మేరకు ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడుతూ.. 'పాకిస్తాన్‌పై దాడికి 20 మిలియన్ల మంది సిక్కులు అనుమతించరు. సిక్కులు పాకిస్తాన్‌కు ఇటుక గోడలా రక్షణ కల్పిస్తారు. పాకిస్తాన్‌పై దాడి చేయడానికి భారత సైన్యాన్ని పంజాబ్ గుండా వెళ్ళనివ్వమని హెచ్చరించాడు. 

Also Read:  Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌‌అండ్‌‌టీ

ఇక మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తూ ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వార్నింగ్ ఇచ్చాడు. రాజకీయ ప్రయోజనాల కోసం పహల్గామ్‌లో భారతదేశం తప్పుడు ఆపరేషన్‌కు పాల్పడిందని పన్నూ ఆరోపించాడు. అయితే భారతదేశం, నాయకత్వం, సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటన చేసిన పన్నూపై భారతీయులు మండిపడుతున్నారు. 

Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!

khalistan | pannu | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు