/rtv/media/media_files/2025/01/29/jG7p7kx67vRXy1VP3EE5.jpg)
Maha Kumbh Stampede
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. అయితే తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం మౌని అమవాస్య కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటలకే కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ అలర్ట్ చేశారు.
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
ఆ సమయంలో భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచనలు చేశారు. అలాగే ఘాట్ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని కూడా హెచ్చరించారు. కానీ అప్పటికే భారీగా తరలివచ్చిన భక్తులు పోలీసుల మాటలు వినలేదు. రద్దీ కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
महाकुंभ में भगदड़ की भयानक तस्वीरें !!
— Dr. Jyotsana (jyoti) (@DrJyotsana51400) January 29, 2025
बड़ी संख्या में लोगों के हताहत होने की खबरें हैं। सिर्फ ऑफिशियल कन्फर्म का इंतजार है।
#MahakumbhStampede #MahaKumbh2025 #pryagraj pic.twitter.com/7XeNQeYenV
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
ఇదిలాఉండగా.. ప్రయాగ్రాజ్లో కుంభమేళా వద్ద మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్ సెక్టార్ -2 వద్దకు వచ్చారు. అమృత స్నానాల కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తోపులాట జరగగా బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు.70 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!