/rtv/media/media_files/2025/04/20/URKdCNubQrvvGa1m1b3q.jpg)
Malli Kharjun Kharge
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీహార్లోని జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు మారతుంటారని ఎద్దేవా చేశారు. బీహార్లోని బక్సర్లో నిర్వహించిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. '' బీహార్లో జేడీయూ, బీజేపీది అవకాశవాద పొత్తు.
Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేతల స్థావరాలు, భారీ బంకర్లు స్వాధీనం!
ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు లేదు. సీఎం పదవి కోసం నితీశ్ కుమార్ పార్టీలు మారుతారు. ఇక ప్రధాని మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారు. బీహార్కు ఇస్తామన్న రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ హామీ ఏమైపోయింది ?. దీనిపై సీఎం నితీశ్ను రాష్ట్ర ప్రజలు నిలదీయాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాగఠ్బంధన్'కు ఓటేయాలి. ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించాలని'' ఖర్గే అన్నారు.
Also Read: నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో
ఇదిలాఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఇటీవల ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ను టార్గెట్ చేసేందుకే ఇలా చేశారంటూ విమర్శలు చేశారు. తమ పార్టీ నేతలు భయపడరని.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారంటూ వ్యాఖ్యానించారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని విమర్శించారు. ఇవి రెండూ కూడా కుల మతాల ఆధారంగా సమాజాన్ని విభజించాలని చూస్తాయనే.. వక్ఫ్ సవరణ చట్టమే దీనికి ఉదాహరణ అని తెలిపారు.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
Also Read: ఎవరికైనా చూపించండ్రా బాబు.. ఫుల్గా తాగి నడిరోడ్డుపై యువతి రచ్చ రంబోలా (వీడియో చూశారా)
rtv-news | malli-kharjun-kharge | nitish-kumar | jdu