/rtv/media/media_files/2025/08/18/nara-lokesh-meets-union-ministers-2025-08-18-21-41-10.jpg)
Nara Lokesh Meets Union Ministers
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్లు టీడీపీ తరఫున రాధాకృష్ణన్కు తమ మద్దతు తెలిపారు. అలాగే మంత్రి లోకేష్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్తో సమావేశమయ్యారు. ఆయనతో వలస కార్మికుల శిక్షణ, ఉద్యోగావకాశాలపై చర్చలు జరిపారు.
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తో భేటీ అయిన మంత్రి @naralokeshpic.twitter.com/Yr66ipHTZF
— greatandhra (@greatandhranews) August 18, 2025
I was delighted to call on Hon’ble External Affairs Minister @DrSJaishankar ji in New Delhi today. We discussed the achievements of our vibrant Telugu diaspora, key takeaways from AP Govt’s recent Singapore visit, and avenues for deeper global collaboration. We reflected on how… https://t.co/EaG0Y1LUwr
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
అనంతరం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని కలిసి యూరియా కొరతను వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన లోకేష్.. రిఫైనరీ ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించారు. అలాగే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో కూడా సమావేశమమై పలు అంశాల గురించి మాట్లాడారు. అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. వీళ్లతో రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి చర్చలు జరిపారు.
Also Read: నెలకు లక్షకు పైగా జీతంతో ఎల్ఐసీలో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డా గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉందని, వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని… pic.twitter.com/pb11EMCwvn
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన లోకేష్.. రిఫైనరీ ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించారు. రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో రూ.95వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న రిఫైనరీ – కమ్ – పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించినట్లు పేర్కొన్నారు.
Also Read: సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5489 కోట్లు స్వాధీనం..
న్యూఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారితో భేటీ అయ్యాను. ఏపీలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల్సిందిగా కోరాను. రామాయపట్నం పోర్టు సమీపాన బీపీసీఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో… pic.twitter.com/QMp8kJsUh4
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
అలాగే కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. వీళ్లతో రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి చర్చలు జరిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాను. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించాను. ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం… pic.twitter.com/rkKQ98m5U2
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ గారితో సమావేశం అయ్యాను. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని విజ్జప్తిచేశాను. రాష్ట్రానికి ఇటీవల… pic.twitter.com/4RWZpS85jT
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
Also Read: ట్రంప్, జెలెన్స్కీ భేటీకి ముందు ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురు మృతి
కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ గారితో కూడా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మారిటైమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జలరవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశమైన లోకేష్.. రాష్ట్రంలోని రోడ్ల విస్తరణ పనుల గురించి చర్చించారు.
కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ గారితో న్యూఢిల్లీలో భేటీ అయ్యాను. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో కీలకమైన మారిటైమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ధి, జలరవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని విజ్జప్తి చేశాను. దుగరాజపట్నం పోర్టుతో… pic.twitter.com/ANjnYLo56I
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి @nitin_gadkari గారితో న్యూఢిల్లీలో సమావేశం అయ్యాను. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం మధ్య 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని విజ్జప్తి చేశాను. హైదరాబాద్ – అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్… pic.twitter.com/BIUCMcxR1r
— Lokesh Nara (@naralokesh) August 18, 2025