/rtv/media/media_files/2025/06/06/uys7cgpcEdTvlNneZtju.jpg)
Saksighupta
ICICI Bank : వినియోగదారులు ఎంతో నమ్మకంతో బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్మును ఓ బ్యాంక్ అధికారి తన సొంతానికి వాడుకుంది. అది కూడా ఒకటి రెండు వేలు కాదు ఏకంగా రూ.4.58 కోట్లు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ఐసీఐసీఐ బ్యాంక్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంక్ అధికారిణి సాక్షిగుప్తా బ్యాంకులో 41 మంది కస్టమర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన మొత్తం నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. వాటితో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టింది. కానీ లాభాలు రాకపోగా భారీనష్టాలు వచ్చాయి.
Also Read: భారత్లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
అయితే కస్టమర్ల సొమ్మును తిరిగి బ్యాంక్లో జమ చేయాల్సి ఉండగా ఆ పనిచేయలేదు. కాగా బ్యాంక్లో డబ్బలు గల్లంతు కావడంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సాక్షిగుప్తానే వాటిని కాజేసినట్లు తేలింది. సోదరిపెళ్లి వేడుకలో సాక్షిగుప్తా ఎంజాయ్ చేస్తుండగా వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Also Read: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సీక్రెట్ మ్యారేజ్.. నెట్టింట వైరల్
ఒక కస్టమర్ తన FD గురించి ఆరా తీయడానికి బ్యాంకుకు వచ్చినప్పుడు ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావాదేవీల మెస్సెజ్లు కస్టమర్లకు చేరకుండా ఉండానికి బ్యాంక్ అధికారిణి ఖాతాలతో లింక్ చేయబడిన కస్టమర్ల మొబైల్ నంబర్లను కూడా మార్చింది."ఆమె తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఈ ఖాతాలకు లింక్ చేసి రూ. 4 కోట్లకు పైగా విత్డ్రా చేసింది. ఖాతాదారులకు జరిగిన మోసం గురించి తెలియకుండా ఉండటానికి ఆమె తన సిస్టమ్లో OTP లను పొందడానికి ఉపయోగించే వ్యవస్థను కూడా రూపొందించింది" అని దర్యాప్తు అధికారి ఇబ్రహీం ఖాన్ అన్నారు. కాగా ఈ విషయమై ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా ఎటువంటి ప్రకట చేయలేదు. అయితే, నష్టపోయిన కస్టమర్లకు సొమ్ము భర్తీ చేస్తామని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
Also Read: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి