/rtv/media/media_files/2025/05/01/ViY2qEO20OOiDlnhvEQS.jpg)
Pakistan Army Plan
భారత్ దాడి చేస్తే ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ మరో కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. భారతీయ నిఘా సంస్థలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది.
BIG BREAKING MEWS :-
— 𝗦𝗶𝗺𝗽𝗹𝘆𝗦𝗕 (♥️) (@s_biswal20) May 1, 2025
A Facebook Post of a senior and key official Maj. Gen. (Retd) A.L.M. Fazlur Rahmanin Bangladesh’s Yunus-led interim govt.
“If India attacks Pakistan, then Bangladesh should retaliate by invading Northeast India and occupying the seven states including… pic.twitter.com/pie8w3G7i2
రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్లో పాక్ సైనిక అధికారులు ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో అనుమానస్పదంగా బంగ్లాదేశ్ పౌరుడిని గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు.
(mayanmar | india pak war | attack in Pahalgam | latest-telugu-news | Indian Army)