భారత్‌ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్.. మయన్మార్, బంగ్లాదేశ్‌లో కుట్ర..!

భారత నిఘా సంస్థలు పాకిస్తాన్ కొత్త పన్నాగాన్ని బయటపెట్టాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, మయన్మార్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆయా సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది.

author-image
By K Mohan
New Update
pakistan army plan

Pakistan Army Plan

భారత్ దాడి చేస్తే ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ మరో కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. భారతీయ నిఘా సంస్థలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. 

రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్‌లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్‌లో పాక్ సైనిక అధికారులు ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో అనుమానస్పదంగా బంగ్లాదేశ్ పౌరుడిని గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు.

(mayanmar | india pak war | attack in Pahalgam | latest-telugu-news | Indian Army)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు