/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-34-5.jpg)
Infosys employees salaries increased
Infosys: ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 5 నుంచి 8 శాతం వరకు జీతాలు పెంచినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను 3 విభాగాలుగా వర్గీకరించి పనిలో ప్రతిభ కనబరిచిన వారికి 20 శాతం వేతనం పెంచినట్లు సమాచారం. 2024 ఏప్రిల్1 నుంచి వేతన పెంపు వర్తించనుంది.
ప్రతిభ కనబరిచిన వాళ్లకు అధిక శాతం..
ఈ మేరకు కంపెనీ పెట్టిన టాస్క్ లను కంప్లీట్ చేసి, ప్రతిభ చూపించిన వారిని 3 భాగాలుగా విభజించి జీతాలు పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి భాగం ఉద్యోగులకు 5-7 శాతం, ప్రశంసించదగ్గ పనితీరు కనబరిచిన వాళ్లకు 7-10 శాతం, అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి 10-20 శాతం వరకు ఇంక్రిమెంట్లు వేసినట్లు సమాచారం. 20 శాతం పెంచిన వారు చాలా తక్కుమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లెవన్ 1-5 వారికి 2024 జనవరి 1 నుంచి జీతాల పెంపు వర్తించనుండగా అందుకుంటారు. లెవల్- 6-10 వారికి ఏప్రిల్ 1 నుంచి పెంచిన జీతాలు ఇవ్వనున్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ 2022లో జీతాల పెంపును నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా 2023 నవంబర్లో చివరిసారిగా వేతనాలు పెంచింది. 2023లో పెంచిన జీతాలతో పోలిస్తే ఈ ఏడాది పెంచిన జీతం 5-10 శాతం తక్కువే.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!
ఇదిలా ఉంటే.. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6,806 కోట్ల నికర లాభాలు పొందింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.38,821 కోట్ల నుంచి 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15,000 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకోవాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ త్రైమాసికంలో 5,591 మందిని చేర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,379కు చేరినట్లు వెల్లడించింది. 2025-26లోనూ 20 వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్