Indrayani river bridge Collapse: ఆ వంతెన కూలడానికి కారణం అదే.. అజిత్ పవార్

మహారాష్ట్రలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. చాలాఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇనుప వంతెన తుప్పుపట్టడంతోనే కూలిపోయిందని పేర్కొన్నారు.

New Update
Indrayani river bridge was rusted, probably collapsed due to crowding, Says Ajit Pawar

Indrayani river bridge was rusted, probably collapsed due to crowding, Says Ajit Pawar

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది పర్యాటకులు గల్లంతయ్యారు. అయితే  ఈ ఘటనపై తాజాగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ స్పందించారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలు వెల్లడించారు. చాలాఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇనుప వంతెన తుప్పుపట్టడంతోనే కూలిపోయిందని పేర్కొన్నారు. 

Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

'' పుణెలో ఇంద్రాయణి నదిపై ఉన్న ఆ బ్రిడ్జి చాలా ఏళ్లక్రితం ఇనుముతో నిర్మించారు. మాకు తెలిసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో భారీ వర్షం కురవడం వల్ల అది బాగా తుప్పుపట్టింది. అది కూలిపోయే సమయంలో ఎక్కువమంది జనం దానిపై గుమికూడారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ నదిపై మరో కొత్త వంతెన నిర్మించేందుకు మా ప్రభుత్వం సిద్ధమవుతోందని'' అజిత్ పవార్‌ తెలిపారు. 

Also Read: మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు

ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సైతం స్పందించారు. ప్రమాదంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వాళ్ల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా.. ఆదివారం ఇంద్రాయణి నదిపై కుందమాల టూరిస్టు ప్రాంతానికి ఆదివారం చాలామంది వచ్చారు. అక్కడ ఇనుప వంతెనపై చాలామంది నిలబడి ఉన్నారు. ఈ క్రమంలోనే అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మిగిలిన వాళ్ల కోసం సహాయక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. 

Also Read: మనాలి జిప్ లైన్ అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక...ఆ తర్వాత.

Advertisment
Advertisment
తాజా కథనాలు