/rtv/media/media_files/2026/01/07/hydrogen-train-2026-01-07-07-38-57.jpg)
India’s first hydrogen train set to debut in Haryana
భారత్లో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్-సోనీపత్ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది. అంతేకాదు ఈ రైలుకు ఇంధనం అందించేందుకు జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3 వేల కిలోలుగా ఉంది. 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కు అందిస్తారు.
Also Read: ప్రధాని మోడీకి సంచలన లేఖ.. ‘POKపై దాడి చేయాలంటూ’
ఆ తర్వాత ఇది రైలుకు నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి.. దక్షిణ హర్యానా బిజ్లీ వితరణ్ నిగమ్ (DHBVN)కు చెందిన అధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ రైలు ప్రాజెక్టుకు సంబంధించి చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలు ఇదే కావడం మరో విశేషం.
India’s 1st Hydrogen fuelled Train starts trial run today on #Jind#Sonipat line
— Ansuman Satapathy (@TechAnsuman) January 6, 2026
RDSO IS CONDUCTING OSCILLATION & EBD TRIALS#India is now 5th country globally with #HydrogenTrain after Germany, Sweden, Japan & China.
A big step for clean & green Rail Travel#IndianRailwayspic.twitter.com/oaf3tqJzA9
Also Read: అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్లాండ్కి తోడుగా
Follow Us