Pahalgam Attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్‌.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

New Update
India summons Pakistan's top diplomat in New Delhi

India summons Pakistan's top diplomat in New Delhi

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతున్న ముష్కరులకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.  క్రమంలోనే పాక్‌ దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.  

పాక్ దౌత్యవేత్తగా ఉన్న సాద్‌ అహ్మద్ వరైచ్‌కు బధవారం అర్ధరాత్రి ఈ సమన్లు పంపించింది. ఆయన్ని పిలిపించిన తర్వాత పాకిస్థాన్ మిలటరీ దౌత్యవేత్తలకు 'పర్సోనా నాన్ గ్రాటా'  అంటే అయిష్ట వ్యక్తులుగా పేర్కొనే అధికారిక నోటీసు ఇచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే వారం రోజుల్లోగా భారత్‌ను విడిచి వెళ్లాల్సి ఉంటుందని విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి.  

Also Read: నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ గురువారం భేటీ కానుంది. ఆ దేశ ప్రధాని షెహబాద్‌ షరీఫ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. భారత్‌ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఈ కమిటీలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ దీనికి అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఉగ్రదాడిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ కూడా ఈరోజు సమావేశం కానుంది.

Also Read:  హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇక జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా పహల్గాం దాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బధవారం సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును వెంటనే నిలిపివేస్తూట్లు ప్రకటన చేసింది. భారత్, పాక్ మధ్య రాకపోకల కోసం ఉండే అట్టారీ చెక్ పోస్ట్ మూసివేయడం, పాకీస్థానీయులకు వీసాలను నిషేధించడం లాంటి నిర్ణయం తీసుకుంది. అలాగే భారత్‌లోని పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని తాజాగా ఆదేశించింది. 

Also Read: నిర్లక్ష్య డ్రైవింగ్‌.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా

jammu-kashmir | telugu-news | terrorist 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు