Bunny Vasu OTT Controversy: పెద్ద హీరోలదే తప్పు.. థియేటర్ల వివాదం పై నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్!

బన్నీ వాసు థియేటర్ల వివాదంపై సంచలన ట్వీట్ చేశారు. సినిమా రిలీజైన 28 రోజులకే ottకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే మరో నాలుగేళ్లలో సింగిల్ స్క్రీన్లు మూతపడతాయని, అలాగే పెద్ద హీరోలు మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు దూరమైపోతారని తెలిపారు

New Update
producer bunny vasu stand on theaters issue

producer bunny vasu stand on theaters issue

Bunny Vasu OTT Controversy:  గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య కొనసాగుతున్న పర్సెంటేజ్ వివాదం గురించి నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ప్రస్తుతం ఆలోచించాల్సింది   పర్సెంటేజ్ సిస్టం గురించి కాదు..  ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా  అనేది! అని అన్నారు. అప్పుడున్న అర్థ రూపాయి వ్యాపారంలో నీది పావులా.. నాది పావులా అని కొట్టుకోవడం కాదు! మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలని స్పష్టం చేశారు. అలాగే సినిమా విడుదలైన 28 రోజులకే ఓటీటీకి ఇచ్చేస్తున్న ట్రెండ్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

పెద్ద హీరోలు ఆలోచించాలి 

''ఇలా సినిమా విడుదలైన 28 రోజులకే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు సంవత్సరాలలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం గురించి పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. పెద్ద హీరోలు రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే .. థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. అంతేకాదు ఈ మూడేళ్ళ గ్యాప్ లో థియేటర్ ఓనర్లు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. ఒకవేళ  సింగిల్ స్క్రీన్లు మూత పడి.. కేవలం  మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రమే ఉన్నట్లయితే పెద్ద హీరోలు ఓ విషయం గుర్తించుకోవాల్సి ఉంటుంది.  మల్టీప్లెక్స్  థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు బన్నీ వాసు. 

Also Read :  నీట్‌ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Also Read :  పోర్న్ చూస్తున్న వారికి బిగ్ షాక్.. HYDలో ఐదుగురు అరెస్ట్!

అసలు పర్సెంటేజ్ వివాదమేంటి..?

అయితే నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్రదర్శించేందుకు  థియేటర్లకు (ఎగ్జిబిటర్లకు)  ఒక ఫిక్స్‌డ్ అద్దెను చెల్లిస్తారు. ఆ తర్వాత సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా..  పెరిగిన లాభాల్లో  థియేటర్ యజమానులకు( ఎగ్జిబిటర్లకు) వాటా ఉండదు. ఆ ఫిక్స్డ్ అద్దె మాత్రం వారికి పరిమితం. దీనివల్ల నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారు. దురదృష్టవశాత్తు  కొన్ని సినిమాలు ఆడకపోతే  ఎగ్జిబిటర్లు నష్టాల్లో పడుతున్నారు. అందుకే ఎగ్జిబిటర్లు  సినిమా లాభాల్లో పర్సెంటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇకపై రెంటల్ విధానంలో సినిమాను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వివాదం గురించి ఫిల్మ్ ఛాంబర్ లో చర్చ జరుగుతోంది. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

 

cinema-news | Exhibitors Percentage in Theaters Issue

Advertisment
Advertisment
తాజా కథనాలు