/rtv/media/media_files/2025/05/10/1NXluTyXamNLKtyAXtJi.jpg)
India big warning to Pakistan, 'Any future act of terror will be considered an Act of War against India'
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్లో ఉగ్రదాడి జరిగితే.. దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అలాగే దీనికి భారత్ కూడా వెంటనే స్పందించి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది.
Also Read: ఎయిర్ రైడ్ సైరన్లను మీడియాలో చూపించొద్దు.. కేంద్రం కీలక ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి అనంతంరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గత రెండ్రోజులుగా పాకిస్థాన్ మళ్లీ భారత్పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. కానీ వాటిని భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఎప్పుడైన భారత్లో ఉగ్రదాడి జరిగితే.. దాని దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావించి చర్యలకు దిగుతామని స్పష్టం చేసింది.
Also Read: భారత్-పాక్ వార్.. బోర్డర్లో టెన్షన్ .. టెన్షన్.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!
2025 మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరలపై భారత్ జరిగిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మరణించిన ఉగ్రవాదుల వివరాలు బయటకు వచ్చాయి. జాష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి.
ఆ ఐదుగురు కీలక ఉగ్రవాదులు:
1. ముదస్సర్ ఖాడియన్ ఖాస్
2. హఫీజ్ ముహమ్మద్ జమీల్
3. మహ్మద్ యూసుఫ్ అజార్
4. ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా
5. మొహమ్మద్ హసన్ ఖాన్
Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!
Indian Army | telugu-news