IND-PAK WAR: మళ్లీ పని చేయని చైనా రక్షణ వ్యవస్థ.. పాకిస్తాన్ నవ్వుల పాలు!

ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ చైనా ఆయుధాలతో భారత్‌పై దాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ వీటిని తిప్పికొట్టింది. అత్యుత్తమ ఆయుధాలు అయిన JF-17, F-16, HQ-9 లను ఉపయోగించిన భారత్‌ను పాక్ ఢీకొట్టలేకపోయింది. దీంతో పాక్ మళ్లీ నవ్వుల పాలైంది.

New Update

ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ గురువారం సరిహద్దుల్లో డ్రోన్లతో విరుచుకుపడింది. చైనా తయారు చేసిన ఆయుధాలతో పాక్ దాడికి పాల్పడగా.. వీటిన్నింటిని కూడా తిప్పికొట్టింది. చైనా ఆయుధాల గురించి గొప్పగా చెప్పకునే పాక్‌ మరోసారి ఫెయిల్ అయ్యింది. పాక్ సైన్యం JF-17, F-16  యుద్ధ విమానాలతో దాడికి పాల్పడింది. ఈ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది. చైనా ఆయుధాల్లో అత్యంత ప్రత్యేకమైన ఆయుధాల్లో JF-17 ఒకటి. దీన్ని భారతదేశపు LCA తేజస్‌తో పోల్చుతారు. ఇది థండర్ బ్లాక్ 2 అత్యాధునికమైన యుద్ధ విమానం. దీన్ని భారత సైన్యం కూల్చివేసింది.  

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

అత్యుత్తమ చైనా ఆయుధాలు కూడా..

JF-17తో పాటు F-16, HQ-9 కూడా వినియోగించగా.. ఇవి కూడా విఫలమయ్యాయి. దీన్ని చైనా ప్రెసిషన్ మెషినరీ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. భారత్ వైమానిక దాడులను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ 2021లో దీన్ని సైన్యంలోకి చేర్చుకుంది. దీని పరిధి కేవలం 125 నుంచి 200 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఒకేసారి 100 లక్ష్యాలను కూడా ట్రాక్ చేయగలదు. ఇలాంటి వాటిని కూడా భారత్ సునాయాసంగా తిప్పికొట్టింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు