/rtv/media/media_files/2025/06/28/air-india-employees-party-2025-06-28-07-46-27.jpg)
ఎయిర్ ఇండియా సిబ్బందిపై వేటు పడింది. అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ విషాదం జరిగిన 10 రోజుల్లోనే ఎయిరిండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ ఎయిరిండియా భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు.
Also Read : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త..సీఐ సస్పెన్సన్
Four Air India Employees Suspended
It has only been a few days since the tragic Ahmedabad plane crash.
— Squint Neon (@TheSquind) June 22, 2025
Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over.
Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
Also Read : మరోసారి తల్లైన ఇలియానా.. పండంటి మగబిడ్డకు జననం
ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు బాధతో వేచిచూస్తుంటే వీళ్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన సదరు సంస్థ 4 సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబీకులకు మేం సంఘీభావంగా నిలుస్తాం. ఈ క్రమంలో ఇటీవల ఆఫీసులో చోటుచేసుకున్న ఓ వ్యవహారానికి చింతిస్తున్నాం. ఆ ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని ఏఐఎస్ఏటీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read : తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
Also Read : మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య
air india | Viral Video | Air India employees suspended | party in office