/rtv/media/media_files/2025/05/01/y3uFoFeVj10Um2hHMHw1.jpg)
Exam Body NTA Cracks Down On Over 100 Telegram, Instagram Channels
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఆన్లైన్లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చర్యలు చేపట్టింది. ఈ పరీక్షపై ఆన్లైన్తో ఫేక్ ప్రచారం చేసిన 120కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 106 టెలిగ్రామ్, 16 ఇన్స్టాగ్రామ్ ఛానళ్లు ఉన్నట్లు NTA వర్గాలు తెలిపాయి. ఈ ఛానళ్లపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
అంతేకాదు అసత్య ప్రచారాన్ని, విద్యార్థుల్లో అనవసర భయాందోళనలు తొలగించేందుకు ఈ ఛానళ్లను తొలగించాలని ఇన్స్టా, టెలిగ్రామ్ సంస్థలను కోరినట్లు సమాచారం. నీట్ ప్రశ్నపత్రం గురించి తప్పుడు ప్రచారం చేసే అనధికార వెబ్సైట్లు/సోషల్ మీడియా అకౌంట్స్, పరీక్ష కంటెంట్ యాక్సెస్కు సంబంధించి ఫిర్యాదులు చేయడం కోసం NTA ఈమధ్యే కొత్త ప్లాట్ఫామ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు సంబంధించి అనుమానస్పదంగా ఏదైనా కంటెంట్ ప్రచారం అవుతున్నట్లు గుర్తిస్తే.. https://neetclaim.centralindia.cloudapp.azure.com/ వెబ్సైట్లో రిపోర్ట్ చేయవచ్చు.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
ఈ క్రమంలోనే నీట్ ఫేక్ వార్తలపై 1500లకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువగా టెలిగ్రామ్ ఛానల్ లింకులే ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది మే4 నీట్ యూజీ పరీక్ష జరగనుంది. దీంతో ఇప్పటికే NTA అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారమే నీట్ అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది.
Also Read: ఇండియా, పాక్ సరిహద్దులు క్లోజ్.. ఈరోజుతో రాకపోకలు బంద్
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
telugu-news | rtv-news