New Update
/rtv/media/media_files/2025/03/20/fg7VwImiJNxwNYvUxqit.jpg)
Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead
గత కొంతకాలంగా ఛత్తీస్గడ్లో మావోయిస్టులు, కేంద్ర భద్రతా బలగాల మధ్య తరచుగా కాల్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ -దంతెవాడ జిల్లాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరో జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బలగాలు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలను అక్కడికి పంపించినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ అన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వివరిస్తామని చెప్పారు. ఇదిలాఉండగా నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో భద్రతా సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇదిలాఉండగా 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు తరుచుగా కాల్పులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో మృతి చెందారు.
Also Read: సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి
naxalite | maoist | chattisgarh | telugu-news | national news in Telugu
తాజా కథనాలు