అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్న ఎలాన్ మస్క్ తండ్రి..!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అయోధ్యను సందర్శించనున్నారు. హర్యానాకు చెందిన సెర్వోటెక్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్‌గా ఎరాల్ మస్క్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఐదు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు.

New Update
Errol Musk

Errol Musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ తండ్రి అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్నారు. మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ హర్యానాకు చెందిన సెర్వోటెక్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఐదు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. జూన్ 6వ తేదీ వరకు భారత్‌లో ఎర్రోల్ మస్క్ పర్యటించనున్నారు. చివరి రోజు అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Pineapple: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

ఇది కూడా చూడండి: 60 ఏండ్ల కళ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మోదీ నుంచి రేవంత్ వరకు నేతల ట్వీట్లు వైరల్!

పర్యటన తర్వాత..

తన పర్యటన ముగించుకున్న తర్వాత ఎర్రోల్ మస్క్ దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అయితే ఈ క్రమంలో భారత దేశానికి వచ్చిన ఎర్రోల్ మస్క్‌కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. హర్యానాలోని సఫియాబాద్‌లో ఉన్న సర్వోటెక్ సోలార్, EV ఛార్జర్ తయారీ యూనిట్‌ను సందర్శించిన తర్వాత ఆయన అక్కడ రాష్ట్ర మంత్రులు, అధికారులతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Viral Video: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు