Ayodhya: అయోధ్యలో దంచికొట్టిన వానలు.. ఇబ్బందుల్లో భక్తులు
అయోధ్యలో గత రెండు రోజులుగా వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.