/rtv/media/media_files/wOa00MkfIJEYPB2yF4Zr.jpg)
Gandhi Bhavan
Gandhi Bhavan : కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైటింగ్తో గాంధీభవన్ మరోసారి రణరంగమైంది. మలక్పేట్కు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం గొడవ జరగడంతో ఒక దశలో అక్కడ ఏం జరుగుతుంతో అర్థం కానీ పరిస్థితి ఎదురైంది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ తనకు డీసీసీ అధ్యక్ష పదవి కావాలని కోరడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read : ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్
Also Read : స్కూల్లో తొక్కిసలాట.. 29మంది పిల్లలు మృతి, 250 మందికి పైగా!
Gandhi Bhavan
గాంధీభవన్లోనే ఇరు వర్గాలు గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో నిరసనలు తెలపడం, గొడవలు పడటంతో అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల గొర్రెలను గాంధీభవన్లోకి పంపి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తరచుగా గాంధీభవన్ గొడవలకు కారణం అవ్వడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. అయినాఅలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సొంతపార్టీ నాయకులే అధిష్టానానికి సూచిస్తున్నారు.
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
Also Read : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కష్టమేనా.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదేనా?
congreess | high tension at gandhi bhavan | attack on gandhi bhavan | gandhi-bhavan | malakpet news