/rtv/media/media_files/2025/04/30/d9BjOUtBq4jZ4FPeSddG.jpg)
Donations in the name of the Army
Cyber Fraud: పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది అమాయకులు బలైపోయారు. దీంతో భారత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. దేశం యావత్తు ఈ దాడిని ఖండించడంతో పాటు ఉగ్రవాదులపై మండిపడుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. ‘భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలివ్వండి’ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్తోపాటు.. పలు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు. ఇది చూసిన పలువురు విరాళాలు పంపుతున్నారు. అయితే దీన్ని ఆర్మీ అధికారులు ఖండిస్తున్నారు.
Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి విరాళం కోరుతూ ప్రభుత్వం బ్యాంకు ఖాతాను తెరిచిందని వాట్సాప్లో "తప్పుదోవ పట్టించే" సందేశం తిరుగుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది."భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి. యుద్ధంలో గాయపడిన లేదా మరణించిన సైనికుల కోసం ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు విరాళం ఇస్తున్నట్లు వాట్సాప్లో తప్పుదారి పట్టించే సందేశం ప్రచారంలో ఉంది" అని ఆ ప్రకటన తెలిపింది.సైబర్ నేరగాళ్లు ఆర్మీ ఆధునికీకరణ, పీఎం కేర్స్ పేరుతో ఫేక్ లింకుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. నెటిజన్లు మోసపోవద్దని, లింకులను షేర్ చేయవద్దని సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత హెచ్చరించారు.
Also Read: అత్యాచారం చేసిన యువతినే పెళ్లిచేసుకున్న ఖైదీ.. జైల్లో ఉండగానే ట్విస్ట్ అదిరింది!
సైబర్ నేరగాళ్లు విరాళాల సేకరణకు ‘పీఎం కేర్స్’ పేరును వాడుకుంటున్నారు."కేబినెట్ నిర్ణయం" అని తప్పుగా ప్రచారం చేస్తూ, ‘‘దేశం కోసం ప్రాణాలర్పించే సైన్యాన్ని బలోపేతం చేయడానికి విరాళాలివ్వండి..’’.. ‘‘సైనికుల పట్ల దేశభక్తిని చాటుకోండి..’’.. ‘‘సైనికుల కోసం రోజుకు ఒక రూపాయి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుతున్నారు..’’.. అంటూ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. ఇదంతా మోసమని సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత దార పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని నెటిజన్లకు సూచించారు.
Also Read: అత్యాచారం చేసిన యువతినే పెళ్లిచేసుకున్న ఖైదీ.. జైల్లో ఉండగానే ట్విస్ట్ అదిరింది!
చెప్పబడిన సందేశంలోని ఖాతా వివరాలు తప్పుగా ఉన్నాయి, దీనివల్ల ఆన్లైన్ విరాళాలు దుర్వినియోగానికి గురవుతున్నాయి" అని మంత్రివ్వ శాఖ పేర్కొంది."యుద్ధ కార్యకలాపాల సమయంలో మరణించిన లేదా వికలాంగులైన సైనికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిందని" మంత్రిత్వ శాఖ తెలిపింది."2020లో, ప్రభుత్వం 'సాయుధ దళాల యుద్ధ ప్రమాద సంక్షేమ నిధి'ని స్థాపించింది, ఇది చురుకైన సైనిక కార్యకలాపాలలో ప్రాణాలు అర్పించిన లేదా తీవ్రంగా గాయపడిన సైనికులు/నావికులు/వైమానిక దళాల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి ఉపయోగించబడుతుంది" అని పేర్కొంది.రక్షణ మంత్రిత్వ శాఖలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ తరపున భారత సైన్యం ఈ నిధికి సంబంధించిన ఖాతాలను నిర్వహిస్తుంది. సాయుధ దళాల యుద్ధ మరణాల సంక్షేమ నిధి ఖాతాలో నేరుగా విరాళం చెల్లించవచ్చని కూడా అది తెలిపింది.