/rtv/media/media_files/2025/04/29/8iwQymC1T9fEXe4qd6KY.jpg)
Delhi Government's Big Step To Regulate Private School Fees
Private School Fees: ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవు. అయితే తాజాగా ఢిల్లీ(Delhi) ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఫీజులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ పాఠశాలలో ఫీజులు ఎంతవరకు ఉండాలనే దానిపై విధివిధానాలను ఖరారు చేసింది. ప్రభుత్వ రూల్స్కు ఎవరైనా విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read: పాకిస్థాన్ దొంగబుద్ధి.. భారత్పై సైబర్ దాడికి యత్నం..
ఫీజుల స్థిరీకరణ, నియంత్రణ బిల్లు..
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులకు సంబంధించి ఇలా తొలిసారిగా నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వమే కావడం విశేషం. మంగళవారం.. ఫీజుల స్థిరీకరణ, నియంత్రణ బిల్లు 2025పై కేబినెట్ సమావేశం జరిగింది. పలు పాఠశాలలు ఫీజులు అడ్డగోలుగా పెంచుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఈ భేటీలో ఫీజులు నియంత్రించేందుకు చట్టాన్ని ఆమోదించారు. ఆ తర్వాత సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. ఫీజుల స్థిరీకరణ, నియంత్రణ బిల్లు 2025 ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.
📢 Big Reform in Delhi Education!
— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025
CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”
A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP
Also Read: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి
ఢిల్లీలోని 1677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్ఎయిడెడ్ లేదా ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు సంబంధించి గైడ్లైన్స్, విధానాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. చరిత్రలో మొదటిసారిగా తమ ప్రభుత్వం ఇలాంటి బిల్లును రూపొందిస్తుందని తెలిపారు. అయితే దీనిపై కొత్త నిబంధనలు అమలు చేసేందుకు మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ అన్నారు. పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడేళ్ల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా దీనిపై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని తెలిపారు.
Also Read: పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు.. ఎక్కడంటే?
latest-news | nationa