/rtv/media/media_files/2025/04/29/mbpykCNKSMzv3FbIWCul.jpg)
kcr cutout
బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కటౌట్ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలు నేతలు వెంటనే నిప్పుపెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ లోని కాలు భాగం పాక్షికంగా కాలిపోయింది. కాగా నిప్పు పెట్టిన వ్యక్తి తిరుపతికి చెందిన రాజా అని పోలీసులు గుర్తించారు. అయితే రాజాకు మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ ఘటనతో తెలంగాణ భవన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.
కేసీఆర్ కటౌట్ కు నిప్పు..
— gaddi pochaiah (@PochaiahGaddi) April 29, 2025
తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్ కాటౌట్ కి
నిప్పు పెట్టేందుకు పలువురు యత్నించారు
స్వల్పంగా కాలిన కేసీఆర్ భారీ కటౌట్
ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని
విచారిస్తున్న పోలీసులు @BRSparty @KTRBRS @TelanganaCMO @BJP4Telangana @BRSHarish pic.twitter.com/5MUHqqLJll