KCR Cutout : కేసీఆర్ కటౌట్కు నిప్పు.. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్!

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కటౌట్ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలు నేతలు వెంటనే నిప్పుపెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో కటౌట్ పాక్షికంగా కాలిపోయింది.

author-image
By Krishna
New Update
kcr cutout

kcr cutout

బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కటౌట్ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు.  పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలు నేతలు వెంటనే నిప్పుపెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ లోని కాలు భాగం పాక్షికంగా  కాలిపోయింది.  కాగా నిప్పు పెట్టిన వ్యక్తి తిరుపతికి చెందిన రాజా అని పోలీసులు గుర్తించారు. అయితే రాజాకు మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ ఘటనతో తెలంగాణ భవన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు