Delhi CM: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం జరిగేది అప్పుడే !

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత కొత్త సీఎం ఎవరు అనేదానిపై క్లారిటీ రానుంది.

New Update
Delhi Chief Minister's oath likely on February 19 or 20

Delhi Chief Minister's oath likely on February 19 or 20

Delhi CM: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి సీఎం ఎవరు, ప్రమాణస్వీకారం ఎప్పుడు అనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పార్టీ వర్గాలు దీనిపై స్పందించాయి. సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో ఉంటాయని పేర్కొన్నాయి. ఇదిలాఉండగా ప్రధాని మోదీ(PM Modi) ఫ్రాన్స్(France), అమెరికా(America) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.  

Also Read:  Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

15 మంది షార్ట్‌లిస్ట్

ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah), పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తదితరులు హాజరుకానున్నారు. ఈ భేటీ తర్వాత కొత్త సీఎం ఎవరు అనేదానిపై క్లారిటీ వస్తుంది. ఇక ఎన్నికల్లో గెలిచిన 48 మంది అభ్యర్థుల్లో మొత్తం 15 మందిని హైకమాండ్ షార్ట్‌లిస్ట్ చేసింది. వీళ్లలో సీఎం, స్పీకర్, కేబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది.   

Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

ఇదిలాఉండగా ఢిల్లీ సీఎం రేసులో కేజ్రీవాల్‌(Kejriwal)ను ఓడించిన పర్వేశ్ వర్మ(Parvesh Verma) ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో సహా విజయేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్‌, పవన్ శర్మ తదితరులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే పూర్వాంచల్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 ఆయన పర్యటన ముగుస్తుంది.

Also Read: న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకుకు బిగ్ షాక్.. కార్యకలాపాలు నిషేధించిన ఆర్బీఐ

ప్రధాని స్వదేశానికి వచ్చిన తర్వాతే సీఎం ఎంపిక, ప్రమాణస్వీకారం జరగనుంది. ఇటీవల జరిగిన దిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మొత్తం 70 స్థానాలకు గాను భాజపా 48 స్థానాల్లో విజయఢంకా మోగించి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్‌ కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేక చతికిలపడిన విషయం తెలిసిందే.

Also Read: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!

Advertisment
Advertisment
తాజా కథనాలు