Operation Sindoor: హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం: రాజ్‌నాథ్‌ సింగ్

ఆపరేషన్ సిందూర్‌ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశామని..హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు.

author-image
By B Aravind
New Update

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. ''ప్రధాని నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన సమాధానం చెప్పాం. భారత సైన్యం తన సత్తాను చాటింది. అమాయకుల ప్రాణాలు తీసినవాళ్లు మూల్యం చెల్లించారు. పౌరుల ప్రాణాలకు నష్టం కలిగించకుండా దాడులు నిర్వహించాం. రైట్‌ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని'' రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 

Also Read: 4 డ్రోన్లు వ‌చ్చి తుక్కు తుక్కు చేశాయ్.. పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో

మంగళవారం అర్థరాత్రి దాటాక...బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ గాఢనిద్రలో ఉన్న సమయంలో సరిగ్గా 1.44 నిమిషాలకు ఏకకాలంలో పాకిస్థాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసింది.భారత్ సైన్యం పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టింది.  ఈ తతంగమంతా కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే పూర్తయింది. పహెల్గాం దాడి తర్వాత రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాక్‌ భారత దాడులను తిప్పికొట్టే పరిస్థితి లేకపోగా.. కనీసం ఒక విమానం కూడా ప్రతిగా పైకి లేవలేదు. 9 ప్రాంతాల్లోనూ ఎక్కడ భారత సైన్యానికి ప్రతిఘటన ఎదురుకాలేదు.

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ తదనంతరం తీసుకునే చర్యల గురించి ఆయా పార్టీల నేతలకు కేంద్రం వివరించనుంది. అలాగే దేశభద్రతకు సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పాకిస్థాన్‌పై చేపట్టిన మెరుపుదాడులను విపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించారు. పాక్ ఉగ్రచర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే నిర్ణయాలకు తాము సపోర్ట్ చేస్తామన్నారు.     

operation Sindoor | telugu-news | national-news | rajnath-singh | Indian Army

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు