Manipur: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు...ఇద్దరు మృతి

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన వేళ దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో తోట జవాన్లు ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. 

New Update
manipur

Manipur

మణిపూర్లో విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ ఘాతుకానికి ఒడిగట్టాడు. డ్యూటీలో ఉండగా అకస్మాత్తుగా తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడక్కడే మృతిచెందగా...మరో ఎనిమిది గాయాలపాలయ్యారు. దీని తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్యహత్య కూడా చేసుకున్నాడు.

క్యాంపుకు దగ్గరలో.. 

ఇంఫాల్‌ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్‌లో ఉన్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ క్యాంపులో సంజయ్‌ కుమార్‌ అనే జవాను తోటి సైనికులపై కాల్పులు చేశాడు.  ఈ ఘటనలో కానిస్టేబుల్‌, ఎస్‌ఐ స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించారు. నిందితుడు 120వ బెటాలియన్‌కు చెందిన హవల్దార్‌ సంజయ్‌ కుమార్‌గా గుర్తించారు. అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్ళి తోట సైనికులపై కాల్పులు జరిపి వారిని పొట్టన పట్టుకున్నాడు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే సంజయ్ కుమార్ కాల్పులు ఎందుకు చేశాడన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

Also Read: మూడ్ ఆఫ్ ది నేషన్ : బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో చంద్రబాబు

మరోవైపు మణిపుర్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్‌ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కానీ తదుపరి సీఎం ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే గత రెండేళ్లుగా మణిపుర్‌లో మెయిటీ, కుకీల జాతుల మధ్య అల్లర్లు జరగుతున్న సంగతి తెలిసిందే.  

  Also Read: USA: సుంకాలపై కీలక నిర్ణయం..ట్రంప్ వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు