Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

New Update
corona virus cases india cross 2700 and 7 death toll state wise infections

corona virus cases india cross 2700

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి మళ్ళీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు 1000 కరోనా కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా.. తాజాగా 2,710కి చేరింది. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

corona virus cases india

ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే సుమారు 1000 కరోనా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. మే 30వ తేదీన 1,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఆ కేసుల సంఖ్య 2,710కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,147 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 494 కేసులు, గుజరాత్లో 223 కేసులు, కర్ణాటక - తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బారిన పడి దాదాపు ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు