Chennai: మరో బాణాసంచా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మంటల్లో!

చెన్నై శివకాశీ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పేలుడు సంభవించి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

New Update
fire accident

తమిళనాడు శివకాశీలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో (Fireworks Shop) భారీ అగ్ని ప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే అగ్ని ప్రమాదం సమయంలో యూనిట్ లో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు.  అయితే ఈ ప్రమాదంలో ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా?  అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read :  బహిరంగ సభలో I Love You అని చెప్పిన కేంద్రమంత్రి! -Video Viral

ఇటీవలే మరో అగ్ని ప్రమాదం 

ఇదిలా ఉంటే ఇటీవలే.. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక సావరం గ్రామంలోని  బాణసంచా తయారీ పరిశ్రమలో  కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి  తీవ్ర గాయాలయ్యాయి. 

Also Read :  విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు

Advertisment
తాజా కథనాలు