/rtv/media/media_files/2025/05/31/WgW1t7bOpm3N9brgCzBt.jpg)
Cds Anil Chauhan Responds For The First Time On Operation Sindoor Losses
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో జరిగిన నష్టాల గురించి మొదటిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ స్పందించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని అన్నారు. భారత ఫైటర్ జెట్స్ కూలిపోయాయని ఇటీవల ప్రచారం జరగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం సింగపూర్లో ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు.
Also Read: పాక్కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్
CDS Anil Chauhan Responds On Operation Sindoor
'' పాకిస్థాన్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు చెప్పింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవం. జెట్ కూలిపోవడం విషయం కాదు. అవి ఎందుకు కూలిపోయాయి, ఏ తప్పులు జరిగాయన్నదే ముఖ్యం. ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే మనం వ్యూహాత్మక తప్పిదాలను అర్థం చేసుకుంటున్నాం. వాటిని సరిదిద్దుకోగలుగుతున్నాం. రెండ్రోజుల తర్వాత దాన్ని సరిగ్గా అమలు చేయగలం. లాంగ్రేంజ్ను టార్గెట్ చేసుకుని అన్ని జెట్స్ను ఎగరవేయగలం.
Also Read: పాక్కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్
పాకిస్థాన్ మోహరించిన చైనా ఆయుధాలు భారత్ ముందు పనిచేయలేదు. 300 కిలోమీటర్ల దూరంలోని పాకిస్థాన్ వైమానిక స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశాం. స్వాతంత్ర్యం వచ్చే సమయంలో పాక్ భారత్ కన్నా అన్ని విషయాల్లో ముందుంది. కానీ ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. ఈ ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ తయారీ ఆకాష్ క్షిపణి వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని'' సీడీఎస్ అనిల్ చౌహన్ అన్నారు.
India’s Chief of Defence Staff on ‘tactical mistakes’ and downed jets: pic.twitter.com/rcbn2J4zbq
— Shiv Aroor (@ShivAroor) May 31, 2025
Also Read: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?
Also Read : జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
operation Sindoor | telugu-news | Pahalgam attack