/rtv/media/media_files/2025/06/28/rajasthan-dig-uncovers-evidence-of-lost-civilisation-2025-06-28-20-50-37.jpg)
Buried for 4,500 years, Rajasthan dig uncovers evidence of lost civilisation
Rajasthan: రాజస్థాన్లో 4500 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. డీగ్ జిల్లాలోని భాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ (ASI) చేపట్టిన తవ్వకాల్లో ఇవి వెలుగుచూశాయి. మౌర్యా, శుంగా రాజవంశీయుల కాలం నాటి వస్తువులు, ఆయుధాలు బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో ఈ తవ్వకాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే పురావస్తు శాస్త్రవేత్తలు 23 మీటర్ల లోతైన పురాతన నది పాయను గుర్తించారు. హరప్పా, బ్రజ్, మథుర ప్రాంతాల్లోని ఆ నాటి నాగరికతల నివాసానికి ఈ నది కీలక ఆధారంగా ఉండేదని చెబుతున్నారు.
Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
అయితే ఈ తవ్వకాల్లో 800లకు పైగా పురాతన వస్తువులు బయటపడ్డాయి. వీటిలో అత్యంత పురాతన నాణేలు, ముద్రలు, యజ్ఞ కుండాలు, మౌర్య, కుషాణ, గుప్త కాలం నాటి విగ్రహాలు, శంఖబంగిళ్లు వంటివి ఉన్నాయి. అంతేకాదు ఒక మానవ కపాల అవశేషం కూడా బయటపడింది. ఈ కపాలాన్ని పరిశోధన కోసం ఇజ్రాయెల్కు పంపించారు. మొత్తానికి ఈ తవ్వకాల ద్వారా ఐదు చారిత్రక దశల ఆధారాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. హరప్పా తర్వాతి కాలం, మహాభారత యుగం, మౌర్యుల కాలం, కుషాణ యుగం, గుప్త యుగానికి చెందిన ఆనవాళ్లు బయటపడినట్లు పేర్కొన్నారు.
Also Read: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!
శివ-పార్వతి టెర్రకోటా విగ్రహాలు అనేవి భక్తి, సంప్రదాయాలను సూచిస్తున్నాయి. ఇక 15 యజ్ఞ కుండాలు వేద, ఉత్తర వేద కాలం నాటి చట్టాలకు సంకేతంగా ఉన్నాయి. ఇక రాగి, ఇనుము మిశ్రమాలతో వినియోగించిన నాణేలు మెటలర్జీ శాస్త్ర పరిజ్ఞానాన్ని చూపుతున్నాయి. అంతేకాదు ఎముకతో తయారుచేసిన సూదులు, అచ్చులు, పళ్లాలు మొదటిసారిగా భారత తవ్వకాల్లో కనిపించాయి.
Also Read: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!