Bomb Threat: సీఎం పినరయ్ విజయన్ నివాసానికి బాంబు బెదిరింపు

కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్‌ స్టేషన్‌కు ఓ ఇమెయిల్‌ పంపించారు. చివరికి అది ఫేక్ ఇమెయిల్‌గా పోలీసులు గుర్తించారు.

New Update
Kerala CM Pinarayi vijayan

Kerala CM Pinarayi vijayan

కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్‌ స్టేషన్‌కు ఓ ఇమెయిల్‌ పంపించారు. అందులో క్లీఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరికి అది ఫేక్ ఇమెయిల్‌గా గుర్తించారు.  

Also Read: వచ్చే 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు.. సీఎం నితీష్ సంచలన ప్రకటన

బాంబు బెదిరింపు రావడంతో సీఎం నివాసాన్ని డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీ చేశామని తెలిపారు. మాకు ఎక్కడా ఎలాంటి అనుమానస్పద వస్తువు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ తనిఖీల సమయంలో సీఎం విజయన్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారని చెప్పారు. ఇటీవల పలు సంస్థలను టార్గె్ట్ చేసుకొని బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ బెదిరింపుల వ్యవహారంతో ఇప్పుడు వచ్చిన ఇమెయిల్‌కు ఏదైనా సంబంధం ఉందా ? లేదా ? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు