Air India: ఎయిరిండియా బ్లాక్‌ బాక్స్‌పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

గుజరాత్‌ విమాన ప్రమాదం తర్వాత బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారనే ప్రచారం నడిచింది. దీనిపై స్పందించిన కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అవన్నీ ఊహాగాణాలేనని కొట్టిపారేశారు. బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉందని తెలిపారు.

New Update
Civil Aviation Minister Rammohan naidu

Civil Aviation Minister Rammohan naidu

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్లాక్‌బాక్సే దిక్కు. అయితే ఇటీవల ఆ బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారనే ప్రచారం నడిచింది. అయితే తాజాగా దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవన్నీ ఊహాగాణాలేనని కొట్టిపారేశారు. 

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

కేంద్ర విమానశాఖ ఆధ్వర్యంలో పుణెలో నిర్వహించిన హెలికాఫ్టర్స్‌ అండ్‌ స్మాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ సమ్మిట్‌ 2025 ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌ బాక్స్‌ను విదేశాలకు పంపిస్తున్నారా అని రిపోర్టర్లు అడ్డగ్గా అవ్వన్నీ ఊహగానాలేనని రామ్మోహన్ నాయుడు అన్నారు. బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు.  

Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం

ఇదిలాఉండగా.. జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిన సంగతి తెలిసిందే. ఓ మెడికల్ కాలేజ్‌ హాస్టల్‌పై కూలండంతో అందులో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు కూడా మరణించారు. ఈ ఘటనలో 240 మంది ప్రయాణికులతో పాటు వైద్య విద్యార్థులు కలిపి మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణించిన రమేష్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 

Also Read: సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్‌లో పెడితేనే.. అమెరికాకు వీసాలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు