/rtv/media/media_files/2025/06/24/civil-aviation-minister-rammohan-naidu-2025-06-24-18-47-12.jpg)
Civil Aviation Minister Rammohan naidu
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్లాక్బాక్సే దిక్కు. అయితే ఇటీవల ఆ బ్లాక్బాక్స్ను విచారణ కోసం విదేశాలకు పంపించారనే ప్రచారం నడిచింది. అయితే తాజాగా దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవన్నీ ఊహాగాణాలేనని కొట్టిపారేశారు.
Also Read: ఈపీఎఫ్ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!
కేంద్ర విమానశాఖ ఆధ్వర్యంలో పుణెలో నిర్వహించిన హెలికాఫ్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్స్ సమ్మిట్ 2025 ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపిస్తున్నారా అని రిపోర్టర్లు అడ్డగ్గా అవ్వన్నీ ఊహగానాలేనని రామ్మోహన్ నాయుడు అన్నారు. బ్లాక్బాక్స్ భారత్లోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం
ఇదిలాఉండగా.. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన సంగతి తెలిసిందే. ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలండంతో అందులో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు కూడా మరణించారు. ఈ ఘటనలో 240 మంది ప్రయాణికులతో పాటు వైద్య విద్యార్థులు కలిపి మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్రయాణించిన రమేష్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్లో పెడితేనే.. అమెరికాకు వీసాలు