/rtv/media/media_files/2025/02/18/cJbtAeNn26ilHa9emHTW.jpg)
2023-24 ఆర్థిక సంవత్సరం (2023-24 Financial Year) లో ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ. 5 వేల 820 కోట్ల ఆదాయం సమకూరిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఇందులో 74.56 శాతం అత్యధిక వాటా (రూ.4,340.47 కోట్లు) బీజేపీకి చేరిందని తెలిపింది. బీజేపీకి రూ.4,340.47 కోట్లు సమకూరగా.. ఆ మొత్తంలో కేవలం 50.96 శాతం మాత్రమే ఖర్చు చేసిందని, అంటే రూ.2,211.69 కోట్లకు సమానమని నివేదిక హైలైట్ చేస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు రూ.1,225.12 కోట్ల ఆదాయం సమకూరగా.. అందులో 83.69 శాతం లేదా రూ.1,025.25 కోట్లు ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిందని తెలిపింది.
Also Read : ప్రార్థనా స్థలాలపై ఎన్నాళ్ళు...ఇక చాలు అన్న సుప్రీంకోర్టు
ఎన్నికల బాండ్ల నుండి అత్యధికంగా
జాతీయ పార్టీలకు వచ్చిన ఈ ఆదాయంలో గణనీయమైన భాగం ఎన్నికల బాండ్ల నుండి వచ్చింది, ఇందులో బీజేపీ (BJP) అత్యధిక వాటాను రూ.1,685.63 కోట్లుగా పొందింది. కాంగ్రెస్ రూ.828.36 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రూ.10.15 కోట్లు సేకరించింది. ఈ మూడు పార్టీలు కలిసి రూ.2,524.14 కోట్లు సేకరించాయి. ఎన్నికల కోసం కాంగ్రెస్ అత్యధికంగా రూ.619.67 కోట్లు ఖర్చు చేసిందని నివేదిక పేర్కొంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది. ఆప్, ఎన్పీపీ, బీఎస్పీ ఆదాయంలో తగ్గుదల కనిపించింది.
Also Read : కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు
2023-24 ఆదాయాలకు సంబంధించి 2024 అక్టోబర్ 31లోగా ఆడిటెడ్ రిపోర్టులు అందించాల్సి ఉండగా.. కేవలం బీఎస్సీ, ఆప్ మాత్రమే నిర్ణీత సమయం లోగా అందించాయి. సీపీఐ పార్టీ 12 రోజుల ఆలస్యంగా, కాంగ్రెస్ 53 రోజులు, బీజేపీ 66 రోజుల ఆలస్యంగా తమ ఆడిట్ రిపోర్టులను అందించాయి. కాగా ADR దాఖలు చేసిన RTI దరఖాస్తుకు ప్రతిస్పందనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంచుకున్న డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలు రూ.4,507.56 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను రీడీమ్ చేసుకున్నాయి. ఈ మొత్తంలో జాతీయ పార్టీల వాటా 55.99 శాతం - రూ.2,524.1361 కోట్లు - ఉంది.
Also Read : అనాధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం.. 140 మంది విద్యార్థులు..
Also Read : అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన