/rtv/media/media_files/2025/06/23/bengal-teen-killed-in-explosion-during-bypoll-vote-counting-2025-06-23-20-47-17.jpg)
Bengal teen killed in explosion during bypoll vote counting
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తూర్పు నదియా జిల్లా బరోచాంద్ నగర్లో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఈ ప్రమాదం జరగే సమయానికి టీఎంసీ పార్టీ లీడింగ్లో ఉంది. బాంబు పేలడంతో తమన్నా ఖాటూన్ అనే 10 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయాలపాలైంది.
Also Read: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి.. 350కి పైగా డ్రోన్లతో కాల్పులు
దీంతో వెంటనే స్థానికులు ఆ చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ చిన్నారి మ-ృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.
Also Read: అమెరికా మరో సంచలన నిర్ణయం.. ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం బిగ్ అలెర్ట్!
ఇదిలాఉండగా ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్లోని కడి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. విసావాదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా గెలిచారు.పంజాబ్లోని లుధియానా వెస్ట్ స్థానంలో కూడా ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలిచారు. ఇక కేరళలో నిలంబుర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ శౌకత్ గెలవగా..పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ విజయం సాధించారు.