Arvind Kejriwal: ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్.. బీజేపీకి ఆ సూచన

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని.. ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల వెంటే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని.. ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల వెంటే ఉంటామన్నారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకొచ్చారు. విద్య, వైద్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో తాము ఎంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!

మరోవైపు ఎన్నికల్లో ఆప్‌ కోసం పోరాడిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. '' మా పార్టీ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆప్‌ను స్థాపించాం. ప్రజల అభివృద్ధి హక్కుల కోసం నిత్యం పోరాటం చేశాం. మా ప్రభుత్వం ఢిల్లీ ప్రజకు ఉచితంగా విద్య, వైద్యం, కరెంట్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాం. ఏ పార్టీ కూడా ఇలాంటి సౌకర్యాలు ఇంతవరకు అందించలేదని'' కేజ్రీవాల్ అన్నారు.     

Also Read: ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

ఓటమిపై ఢిల్లీ సీఎం అతిషి కూడా స్పందించారు. తనపై నమ్మకంతో కల్కాజీ స్థానం నుంచి గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఓడిపోయినప్పటికీ బీజేపీ చేస్తున్న అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల్లో ఆప్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి నేతలు కూడా ఓడిపోయారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. 

Also Read: కేజ్రీవాల్ను ఓడించిన ఘనడు... ఎవరీ పర్వేష్ వర్మ?

Advertisment
Advertisment
తాజా కథనాలు