IND PAK WAR 2025 : సైన్యం ఉగ్రవాదులు చెట్టాపట్టాల్‌...పాక్‌ బండారం బట్టబయలు

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బహిర్గతమైంది. దీన్ని ఆధారాలతో  ప్రపంచం ముందుంచింది భారత్‌. ఆపరేషన్‌ సిందూర్‌లో మరణించిన తీవ్రవాదులకు పాక్‌ సైన్యం, ఉగ్రవాదులు సంయుక్తంగా నివాళులు అర్పిస్తున్న వీడియోలను బయటపెట్టింది. 

New Update
Pakistan Army pays tribute to terrorists

Pakistan Army pays tribute to terrorists

IND PAK WAR 2025 : దాయాది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు పెంచి పోషిస్తోందన్న భారత్‌ ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పటికే పలు ఆధారాలు ప్రపంచం ముందు బయటపెట్టిన భారత్‌ తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో మరణించిన తీవ్రవాదులకు పాక్‌ సైన్యం, ఉగ్రవాదులు సంయుక్తంగా నివాళులు అర్పిస్తున్న వీడియోలను బయటపెట్టింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పై దాడులు చేస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బహిర్గతమైంది. దీనికి సంబంధించిన ఆధారాలతో  ప్రపంచం ముందుంచింది భారత్‌ దేశం.   

  Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
 
బ్రిటీష్‌ పాలన తర్వాత రెండు దేశాలుగా విడిపోయిన భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య నాటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి వైపు పయనిస్తుంది. తోటి దేశంతో పోటీపడి మరింత అభివృద్ధి సాధించాల్సిన పాక్‌ మాత్రం భారత్‌ ను ఒక శత్రువుగా భావిస్తూ విషం చిమ్ముతుంది. ఈ క్రమంలో  ఏళ్లుగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారత్‌ మీదకు పంపుతోంది. ఈ క్రమంలోనే 75 సంవత్సరాలుగా దేశంపై అనేక దాడులు చేసింది. చేస్తూనే ఉంది. ఇటీవల ఉగ్రవాదులు ఇటీవల పహల్గాంలో టూరిస్టులను బలిగొన్నారు. దీంతో  ఆ దేశానికి గట్టి షాక్ ఇచ్చింది భారత్‌. తాజాగా  ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీసింది భారత్.

ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
  

ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్థాన్ తమ దేశంలో టెర్రరిస్టులు లేరని బుకాయించ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందు కీలక ఆధారాలు బయట పెట్టారు. పహల్గాం దాడుల తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో పలువురు ఉగ్రవాదులు చనిపోయారు. వారిలో  జైషే ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజహర్ కూడా ఉన్నాడు. అయితే ఆ ఉగ్రవాదితో పాటు ఇతర ఉగ్రవాదుల అంత్యక్రియలను అక్కడి ప్రభుత్వంతో పాటు ఆర్మీ అధికారులు అధికారికంగా నిర్వహించారు. అయితే ఇక్కడ మరో విషేషం ఏంటంటే ఈ అంత్యక్రియల్లో పాక్‌ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. సైన్యం ఉగ్రవాదులు చెట్టాపట్టాల్‌ వేసుకుంటూ మరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఉగ్రవాదుల శవాపేటికలపై ఆ దేశ జాతీయ పతకాన్ని కప్పి మరి నివాళులు అర్పించారు.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు


ఆ టెర్రరిస్టుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ, సర్కారు అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోలను నేషనల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దొరైస్వామి బయటపెట్టారు. ఇందులో టెర్రరిస్టుల శవపేటికపై పాక్ జెండాలు కప్పి ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని ద్వారా ఉగ్రదాదుల వెనుక ఎవరు ఉన్నారు, వాళ్లకు ఇన్నాళ్లూ అండగా ఉంటోంది ఎవరనేది అందరికీ తెలుస్తోందని విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు. టెర్రరిస్టుల వెనుక పాకిస్థాన్ ఉందడానికి ఇంతకంటే మరో ప్రూఫ్ ఉండన్నారు. దీంతో  పాకిస్థాన్ ప్రపంచం ముందు అడ్డంగా బుక్కయింది.. ఇప్పుడు పాక్ మొహం ఎక్కడ పెట్టుకుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

  Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు