/rtv/media/media_files/2025/06/28/taj-mahal-2025-06-28-10-27-32.jpg)
ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ డేంజర్ జోన్ ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తాజ్మహల్కు పగుళ్లు వస్తున్నాయి. వరల్డ్ టూరిస్ట్ ప్లేస్గా ఉన్న ఆగ్రాలోని తాజ్మహల్లో వర్షపు నీరు లీకవుతోంది. తాజ్మహల్ ప్రధాన గుమ్మటంలో 73 మీటర్ల ఎత్తున ఒక చోట నీటి లీకేజీని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా థర్మల్ స్కానింగ్ గుర్తించింది. ఏఎస్ఐ నిర్వహిస్తున్న తనిఖీలు మరో 15 రోజులు జరుగుతాయి. ఆ తర్వాత గుమ్మటంపై మరమ్మతు పనులను చేపడతారు. పాలరాతి కట్టడంలో 3 ప్రధాన సమస్యలను ఏఎస్ఐకి చెందిన లైట్ డిటెక్షన్, రేంజింగ్ ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్లు వర్గాలు తెలిపాయి.
Also Read : గుడికి ఏనుగు బహుకరించిన టాలీవుడ్ హీరోయిన్
Also Read : మావోయిస్టులకు బిగ్ షాక్..మరో 13 మంది కీలక నేతలు!
Cracks In Taj Mahal
ప్రధాన గుమ్మటంపైన రాళ్ల మధ్యలో ఉండే సున్నం, ఇసుకల మిశ్రమం బలహీన పడింది. గుమ్మటం పైకప్పు తలుపు, గచ్చు పాతపడ్డాయి. తాజ్మహల్ పైన ఉండే శిఖరఇనుప చువ్వ తుప్పు పట్టిన కారణంగా వీక్ అయ్యిందని నిపుణులు తెలిపారు. దీంతో మిశ్రమానికి, రాళ్లకు మధ్య గ్యాప్లు రావడంతో నీరు లీకేజీ అవుతోంది. తాజ్ మహల్ ప్రధాన గుమ్మటంపైన పరంజాను ఏర్పాటు చేసిన ఏఎస్ఐ బృందం ప్రత్యక్ష తనిఖీ నిర్వహించనున్నది.
Also Read : రైల్వే ట్రాక్పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో..
Also Read : ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’
cracks | cracks in the Taj Mahal | taj-mahal