Gali Janardhana Reddy : గాలి జనార్దన్‌ రెడ్డికి మరో షాక్‌.. ఎమ్మెల్యే పదవి రద్ధు

ఓబుళా పురం గనుల్లో జరిగిన అక్రమాలపై ఏడు సంవత్సరాల జైలు శిక్షకు గురైన కర్ణాటక మైనింగ్‌ వ్యాపారి గాలి జనార్ధన్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. బీజేపీ నుంచి గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన శాసనసభ్యత్వం రద్దయింది.

New Update
Gali Janardhana Reddy

Gali Janardhana Reddy

Gali Janardhana Reddy: ఓబుళా పురం గనుల్లో జరిగిన అక్రమాలపై ఏడు సంవత్సరాల జైలు శిక్షకు గురైన కర్ణాటక మైనింగ్‌ వ్యాపారి గాలి జనార్ధన్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. బీజేపీ నుంచి గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన శాసనసభ్యత్వం రద్దు అయింది.  ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె విశాలక్షి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  "హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రధాన ప్రత్యేక కోర్టు, సీసీ నెం.1 ఆఫ్ 2012లో గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక శాసనసభ సభ్యుడు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించినందున, ఆయన దోషిగా తేలిన తేదీ అనగా 2025 మే 6 నుంచి కర్ణాటక శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడమైనది" అని పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

Big Shock To Gali Janardhana Reddy

కాగా ఓబులా పురం గనుల విషయంలో ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో ఇటీవలే ఆయనకు కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ గనుల విషయంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు గాలిని దోషిగా ప్రకటిస్తూ ఏడేళ్ల శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం నేరం చేసిన వారికి పదవిలో కొనసాగే అవకాశం లేదు. కాగా ఆయన సభ్యత్వం రద్దయినందున ఈ నెల 6 నుంచి ఆరేళ్లపాటు ఆయనపై అనర్హత అమల్లో ఉంటుంది.

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
  
అయితే ఈ విషయంలో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. అయితే ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే, విడుదలైన నాటి నుంచి మరో ఆరేళ్లపాటు అనర్హత కొనసాగే అవకాశం ఉంది. ఇక గాలి అనర్హతతో  కర్ణాటక శాసనసభలో ఒక స్థానం ఖాళీ అయిందని కార్యదర్శి తన నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

మే 6న వెలువడిన ఓబుళాపురం మైనింగ్ కేసు తీర్పులో, గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2009 లో జరిగిన ఈ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ భారీ అవినీతి కేసులో అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగించినట్లు తేలింది. దీంతో గాలి జనార్ధన్‌ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.  కాగా ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి ఎన్నికల సమయంలో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించి పోటీ చేశారు. అయితే ఆయన పార్టీ తరుపున ఆయన ఒకరే విజయం సాధించారు. ఎన్నికల అనంతరం తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి 2024లో తిరిగి బీజేపీలో చేరారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

assembly | karnataka | mla | cbi-court | gali-janardhan-reddy

#gali-janardhan-reddy #cbi-court #mla #karnataka #assembly
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు