Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. భార్య మాట విని బతికిపోయిన భర్త

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఉమాంగ్ పటేల్ అనే డాక్టర్ త్రుటిలో తప్పించుకున్నారు. జ్వరం రావడంతో అతడు తన భార్య, ఫ్యామిలీ మాట విని టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం తన భర్య, ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పారు.

New Update
Gujarat Doctor Cancels Air India Flight Ticket To London That Later Crashed

Gujarat Doctor Cancels Air India Flight Ticket To London That Later Crashed

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఊహించని ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 241 మంది ప్రయాణికులు మృతి చెందారు. 

Ahmedabad Plane Crash

అయితే ఈ ప్రమాదం నుంచి ఓ డాక్టర్ త్రుటిలో తప్పించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన ఓ డాక్టర్ తన భార్య, ఫ్యామిలీ మాట విని టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీని కారణంగా తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. వారి మాటలు వినకపోతు ఇవాళ తాను బతికి ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. 

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

ఏమైందంటే?

అతడి పేరు ఉమాంగ్ పటేల్. అతడు గుజరాత్‌కు చెందిన ఒక డాక్టర్.  లండన్‌లోని నార్తాంప్టన్‌లో ఉంటున్నారు. మే 24వ తేదీన తన భార్య, కుమారులతో కలిసి గుజరాత్‌లోని మహిసాగర్‌కు వచ్చారు. అక్కడ తన ఫ్యామిలీని ఉంచి జూన్ 12న నార్తాంప్టన్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో వెళ్లేందుకు టికెట్ తీసుకున్నారు. 

Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

అయితే జూన్ 9న అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజుకు అది మరింత పెరగడంతో అతడి భార్య ఆందోళన చెందింది. దీంతో ఆరోగ్యం కుదుటపడేవరకు ఇక్కడే ఉండమని కోరింది. కుటుంబ సభ్యులు కూడా అదే మాట చెప్పడంతో అతడు సరే అన్నారు. అనంతరం అతడి విమానం టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత జూన్ 15కి టికెట్ చేసుకున్నారు. ఈ లోగా విమాన ప్రమాదం వార్త విని షాక్‌కు గురయ్యారు. ఆ దేవుడే తనను తన భార్య, ఫ్యామిలీ రూపంలో వచ్చి కాపాడాడు అని దేవున్ని ప్రార్థించారు. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

Advertisment
Advertisment
తాజా కథనాలు