Air India Crash Victims: ఎయిర్ ఇండియా ప్రమాదం.. 247 డెడ్‌బాడీలు గుర్తింపు

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో బాధితులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 247 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 232 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు తెలిపారు.

New Update
ahmedabad air india plane crash victims dna test reports

ahmedabad air india plane crash victims dna test reports

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో బాధితులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 247 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 232 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

247 DNA నమూనాలు

అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 247 డిఎన్ఎ నమూనాలను సరిపోల్చామని, ఇందులో 187 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ వారు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారని తెలిపారు. మృతుల్లో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, డయ్యూ, నాగాలాండ్‌కు చెందిన వారి మృతదేహాలు కూడా ఉన్నాయని తెలిపారు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

చిత్రనిర్మాత మృతి

ఈ ప్రమాదం జరిగిన రోజు మిస్సయిన మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మ‌హేష్ జీరావాలా మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు. ప్రమాదం జరిగిన రోజునుంచి ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన అదృశ్యం ఇన్నాళ్లు మిస్టరీగా మారగ డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో ఆయనకు సంబంధించిన యాక్టివా స్కూటర్‌, ఫోన్ కూడా లభించడంతో ఆయన మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రమాదం జరిగిన రోజు ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో ఒకరిని కలిసేందుకు వెళ్లాడని అతని భార్య హేతల్‌ తెలిపారు. తాజాగా ఆయన మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

ఏం జరిగింది?

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మేఘనానిగర్‌లోని హాస్టల్ క్యాంపస్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. విమానంలో మొత్తం 241 మంది ఉన్నారు. మిగిలిన మృతులు హాస్టల్ భవనంలోనే ఉన్నవారే. ఈ ప్రమాదం నుండి ఒక ప్రయాణీకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

Also Read :  బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

 

air india accident | Ahmedabad Plane Crash | Plane Crash

Advertisment
Advertisment
తాజా కథనాలు