/rtv/media/media_files/2025/06/28/ahmadabad-flight-accident-2025-06-28-21-51-58.jpg)
Ahmadabad Flight Accident, DNA test identifies last victim, death toll stands at 260
గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి డీఎన్ఏ పరీక్షలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారికంగా లెక్కతేల్చారు. ఇందులో నేలపై మరణించిన 19 మందితో కలిపి 200 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు జాతీయులు, ఒక కెనడియన్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ముందుగా ఈ విమాన ప్రమదాంలో 270 మంది మరణించినట్లు అధికారులు అంచనా వేశారు. 230 మంది ప్రయాణికుల్లో రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా 241 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. విమానం మెడికల్ కాలేజీపై కూలడంతో అందులో ఉన్న 19 మంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందారు. మొత్తంగా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా తేలింది.
Also Read: సంచలనం.. బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి నాగరికత
ఇదిలాఉండగా జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలింది. ఎయిర్పోర్ట్ దగ్గర్లోని మెడికల్ కాలేజీ హస్టల్పై కూలింది. ఆ సమయంలో అందులో మెస్లో ఉన్న వైద్యవిద్యార్థులతో పాటు మరికొందరు స్థానికులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి ఇంకా చికిత్స జరుగుతూనే ఉంది.
Also Read: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!