/rtv/media/media_files/2025/04/24/d3M1uuSuh92TwnkAjXmn.jpg)
After Pahalgam terror attack, Pakistan issues fresh notice of missile test off its Karachi coast
జమ్మూకశ్మీర్లో పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్లోని పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను వారం రోజుల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: జమ్మూకాశ్మీర్లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
భారత్-పాక్ యుద్ధం జరుగుతుందా ?
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్లూజివ్ జోన్లో ఈ క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఈ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. భారత రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. దీంతో ముంబయిలోని భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరమంతా పోలీసు బలగాలు రాత్రిపూట క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని సీనియర్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బీచ్, హోటల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి ఇది భారత్, పాక్ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
Also Read: ఆర్మీకి చిక్కకుండా.. ఉగ్రవాదులు వాడిన సీక్రెట్ యాప్ ఇదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఇదిలాఉండగా పహల్గాం దాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బధవారం సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును వెంటనే నిలిపివేస్తూట్లు ప్రకటన చేసింది. భారత్, పాక్ మధ్య రాకపోకల కోసం ఉండే అట్టారీ చెక్ పోస్ట్ మూసివేయడం, పాకీస్థానీయులకు వీసాలను నిషేధించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. అలాగే భారత్లోని పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
Also Read: జమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. ఓ జవాన్ మృతి
telugu-news | rtv-news | national-news